text stringlengths 6 38.7k | label int64 0 4 |
|---|---|
భారీ ఎత్తున మొండిబకాయిలు పెరిగిపోవడంతో ఐడిబిఐ వ్యవహారాలపై భారత రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) ఒక కన్నేసింది. ఐడిబిఐ బ్యాంకును ఆర్బిఐ వాచ్లి్స్టలో చేర్చినట్టుగా తెలిసింది. నికర మొండిపద్దుల మొత్తం 6 శాతం దాటడం, వరసగా రెండేళ్ల పాటు నష్టాలను ప్రకటించడం, కాపిటల్ అడెక్వసీ నిర్దేశిత ప్రమాణాల కంటే తగ్గడం... ఈ సందర్భాల్లో బ్యాం... | 0 |
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల(పిఎస్ బి) చీఫ్లతో సమావేశంకానున్నారు. దాదాపు రోజంతా జరిగే ఈ సమావేశంలో పిఎస్ బిలకు గుది బండగా మారిన మొండి బకాయి(ఎన్పిఎ)ల వసూళ్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. ఇంకా పిఎస్ బిల పనితీరు, ఒత్తిడిలో ఉన్న రుణాల పరిస్థితి, బ్యాలెన్స్ షీట్ల ... | 0 |
కటక్: ఇంగ్లండ్తో జరుగుతున్న సెకండ్ వన్డే మ్యాచ్లో భారత జట్టు మూడో వికెట్ పడగొట్టింది. 82 పరుగులతో దూసుకెళుతున్న ఓపెనింగ్ బ్యాట్స్మన్ జాసన్ రాయ్ను జడేజా ఔట్ చేశాడు. 27వ ఓవర్ మొదటి బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ స్కోర్ 27 ఓవర్లు ముగిసే సమయానికి 172/3. మ్యాచ్ గెలిచేందుకు ఇంగ్లండ్ ఇంకా 209 పరుగులు చేయాల్సి... | 4 |
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాది హపీజ్ సయీద్ స్వేచ్ఛనిచ్చి, భారతదేశానికి ఆగ్రహం తెప్పించింది. 24 గంటలు గడవక ముందే మరో రెచ్చగొట్టే చర్యకు దిగింది. కశ్మీరు అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. కశ్మీరులో నిత్యం మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించింది. తమ నిఘా వర్గాల కన... | 3 |
స్టార్ హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబంతో గడిపే అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోవడం లేదు ఇప్పటి సినిమా హీరోలు. ఖాళీగా ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం స్టైలిష్స్టార్ అల్లు అర్జున్కు అలవాటు. వృతిపరమైన విషయాలనే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం కూడా బన్నీకి అలవాటు. | 2 |
సుప్రీం కోర్టుకు సీవోఏ మధ్యంతర నివేదికన్యూఢిల్లీ: బీసీసీఐ పగ్గాలను పూర్తిగా తమ చేతికే అందించాలని కమిటీ ఆఫ్ అడ్మిస్ట్రేటర్స్ (సీవోఏ) సుప్రీం కోర్టును కోరింది. సంస్కరణల అమలుపై కోర్టుకు సమర్పించిన ఐదో మధ్యంతర నివేదికలో ఆఫీసు బేరర్ల ఉదాసీన వైఖరిని ఎండగట్టింది. లోధా కమిటీ సిఫారసుల అమల్లో విఫలమైన బోర్డు తాత్కాలిక అధ్యక్షు... | 4 |
కన్సాస్ : విద్వేషపూరిత దాడుల నేపథ్యంలో ప్రవాస భారతీయుల్లో ఆందోళన తారస్థాయికి చేరింది. మనసారా మాతృభాషలో మాట్లాడుకోవాలన్నా భయపడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కలుసుకున్నపుడు ఆంగ్లంలోనే మాట్లాడుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పుకుంటున్నారు. ‘‘అమెరికాలో బహిరంగ ప్రదేశాల్లో కలుసుకున్నపుడు హిందీలోగానీ, ఏదైనా ఇతర భారతీయ భాష... | 3 |
అటు క్రికెట్.. ఇటు హాకీ రెండింటిలో దాయాదుల సమరంన్యూఢిల్లీ : ఈ ఆదివారం ఇతర ఏ కార్యక్రమాలూ పెట్టుకోకండి..! ఆటలపై అమితాసక్తి ఉ న్న వారైతే మరీను..! ఒకవేళ తప్పకుండా పాల్గొనాల్సిన కార్యక్రమం అయితే కనీసం మధ్యా హ్నం ఒంటి గంటకల్లా పూర్తి చేసుకొనేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు రెండు అతి ము ఖ్యమైన మ్యాచ్లు ఉండడమే. ఆ రెం... | 4 |
నిర్మాణ సంస్థ: డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్, శ్రావ్య ఫిలిమ్స్తారాగణం: పవన్, కారుణ్య, రాకేష్, మహేంద్ర, నారాయణ, ఆషా, మహేశ్, అంబటి శీను, కిశోర్ దాస్, తిరుపతి దొరై, వీరబాబు, చిల్లర రాంబాబు, ఆంజనేయులు తదితరులుకూర్పు: శామ్యూల్ కళ్యాణ్సంగీతం: ప్రవీణ్ ఇమ్మడిఛాయాగ్రహణం: శివరామ్ నిర్మాతలు: కిశోరి బసి... | 2 |
న్యూఢిల్లీ: బధిర యువతి గీతను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన వారికి రూ.లక్ష నగదు అందజేస్తామని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు. భారత్కు చెందిన గీతను పదిహేనేళ్ల క్రితం లాహోర్లో ఆగి ఉన్న సంఝౌతా ఎక్స్ప్రె్సలో పాకిస్తాన్ సైనికులు గుర్తించారు. ప్రభుత్వం చొరవతో 2015లో భారత్లో అడుగుపెట్టిన గీత ఇప్పటికీ తల్లిదండ్రు... | 3 |
న్యూఢిల్లీ : కటక్ వన్డేలో శతకంన్నర కొట్టిన యువరాజ్ సింగ్ గురించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉద్వేగభరితమైన ట్వీట్ చేశాడు. ‘అతను క్యాన్సర్ను ఓడించాడు. ఇవాళ ఇంగ్లండ్ బౌలర్లను మాత్రమే ఓడించాడు. నిరాశ చెందకూడదని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల’ని వీరూ అన్నాడు. క్యాన్సర్తో యువీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటి ఫొటో కూడా ... | 4 |
తళతళ మెరిసే తెల్ల గడ్డంతో ఉన్న ఈ వ్యక్తి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కోల్కతా వేదికగా జార్ఖండ్-కర్ణాటక జట్ల మధ్య జరిగే మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా మహీ ఇలా పూర్తిగా నెరిసిన గడ్డంతో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. | 4 |
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో వన్డే సిరీస్ తన క్రికెట్ కెరీర్కు టర్నింగ్ పాయింట్ అని కేదార్ జాదవ్ అన్నాడు. ఈ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడంపై మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదటి వన్డే తర్వాతనే దీన్ని ఊహించానని చెప్పాడు. ఇలానే తన ప్రదర్శన కొనసాగిస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం తేలికేనని ఫస్ట్ వన్డే తర్వాత అనుకున్న... | 4 |
గత నెల 28న విడుదలైన బాహుబలి-2 సినిమా సంచలనం సృష్టించే దిశగా దూసుకుపోతోంది. అక్కడక్కడ కొన్ని విమర్శలు ఎదురవుతున్నా మెజారిటీ జనాలు మాత్రం బాహుబలి-2ను ఆదరిస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా బాహుబలి-2ను, దర్శకుడు రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ బాహుబలి-2లోని... | 2 |
న్యూఢిల్లీ: ఇజ్రయెల్ పర్యటనకు వెళ్తున్న తొలి భారత ప్రధానిగా ఇప్పటికే ప్రత్యేక ఘనత అందుకున్న నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఇజ్రయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ప్రధాని మోదీని రిసీవ్ చేసుకోనున్నారు. మంగళవారం మధ్యాహ్నం బెన్ గురియన్ విమానాశ్రయంలో ఆయన మోదీకి ఎదురేగి స్వాగతం పలకనున్నారు. ఇప్పటివరకు క... | 3 |
పటిష్ఠ స్థితిలో కర్ణాటక కోల్కతా: కరుణ్ నాయర్ (148 బ్యాటింగ్) అజేయ శతకంతో రాణించడంతో.. విదర్భతో రంజీ సెమీస్లో కర్ణాటక పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఓవర్ నైట్ స్కోరు 36/3తో రెండో రోజైన సోమవారం ఆటను కొనసాగించిన కర్ణాటక.. వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 294/8 స్కోరు చేసింది. నాయర్తోపాటు కెప్టెన్ వినయ్ క... | 4 |
ఈసారి చిరు, బాలయ్య సినిమాలతో సంక్రాంతి అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎవరి నోట విన్నా ఈ రెండు సినిమాల గురించి ప్రస్తావనే. ఇప్పటికే ఈ సినిమాల విడుదలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అభిమానులు కూడా సినిమా విడుదలకు ముందు చేసే కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎంతో మంది అభిమానుల వలే తాను కూడా ఈ రెండు సినిమాల... | 2 |
నీట్ ప్రశ్నపత్రంలో తప్పులపై సీబీఎస్ఈ.. పేపర్ లీక్ కేసులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి అరెస్టున్యూఢిల్లీ/షేక్పురా, మే 10: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లాయంటూ అభ్యర్థులు, విద్యానిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఈ అంశంపై బుధవా... | 3 |
న్యూ ఢిల్లీ: జపాన్ అధికార పీఠాన్ని షింజో అబే మరోసారి కైవసం చేసుకున్నారు. జపాన్లో తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ, మరోపార్టీతో కూడిన సంకీర్ణ కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో లిబర్ డెమోక్రాటిక్ పార్టీ కూటమీ 312 సీట్లు గెలుచుకుంది. దీంతో జపాన్లో షింజో అబే నే... | 3 |
కన్నడలో హిట్గా నిలిచిన 'రాజధాని' చిత్రాన్ని తెలుగులో సంతోష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సంతోష్ కుమార్ 'భాగ్యనగరం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్కి రెడీ అవుతోంది. కన్నడ బిగ్స్టార్ అయిన యష్ ఈ చిత్రంలో హీరోగా న... | 2 |
న్యూఢిల్లీ: టెలికాం రంగంలోని టెలినార్ ఇండియాను విలీనం చేసుకునేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తెలిపిందని ఎయిర్టెల్ ప్రకటించింది. ఈ రెండు కంపెనీలు విలీనం కోసం ఈ నెల ఫిబ్రవరిలో ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత, యుపి (ఈస్ట్), పశ్చిమబెంగాల్ (వెస్ట్), అస్సాం సర్కిళ్ళు టెలినార్ ... | 0 |
బీజింగ్: చైనాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఫ్రావిన్స్లో భారీ స్థాయిలో కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో 100 మంది వరకూ మరణించారని తెలుస్తోంది. జన్మో గ్రామంలో ఓ పర్వతంలోని చాలా భాగం కూలిపోవడంతో సమీపంలోని 40 గృహాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీస... | 3 |
భయంతో పోలీసులకు ఫోన్లు చేసిన ద్వీపవాసులుఅవి పొరబాటు హెచ్చరికలేనని తర్వాత వెల్లడిఇప్పుడే దాడులు చేయబోనన్న కిమ్హగట్నా (గ్వామ్), ఆగస్టు 15: అది.. అసలే ఉత్తరకొరియా అణుక్షిపణులకు అందేంత దూరంలో ఉన్న గ్వామ్ ద్వీపం. అమెరికా నౌకా, వైమానిక దళ స్థావరాలున్న ఆ ద్వీపం మీద ‘ఇహనో ఇప్పుడో ఆ ద్వీపం మీద మేం బాంబులు వేసేస్తాం’ అంటూ ఉత్... | 3 |
తెలుగులో అభినయ ప్రాధాన్యమున్న పాత్రలతో ఆకట్టుకున్నారు మలయాళ కుట్టి నిత్యామీనన్. ఉన్నట్టుండి ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దానికి కారణం ఆమె ఆలోచనలు దర్శకత్వంపైపు మలుపు తిరగడమే అనే వార్తలు వినిపించాయి. దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు నిత్యామీనన్. ‘నాకు దర్శకత్వం మీద ఇష్టమున్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. ... | 2 |
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబుపై వివాదాల డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన డబ్బింగ్ మూవీలను ప్రమోట్ చేసుకోవడానికి తమిళ వికృత క్రీడ జల్లికట్టుకు మద్దతు తెలిపిన మహేశ్ బాబు.. తనను స్టార్గా నిలబెట్టిన ఏపీ కోసం, ఏపీ ప్రజల కోసం ఎందుకు మద్దతు తెలపట్లేదని ప్రశ్నించాడు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా.. పక్... | 2 |
బెంగళూరు, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సుప్రీం ఆదేశాల నేపథ్యంలో కేంద్రమంత్రి ఉమాభారతి వెంటనే రాజీనామా చేయాలని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. గురువారం కలబురిగిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా కోరే బీజేపీ ఇప్పుడు ఎంద... | 3 |
సప్తగిరి కథానాయకుడిగా నటించిన చిత్రం `సప్తగిరి ఎల్.ఎల్.బి`. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ బ్యానర్పై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 7న వరల్డ్వైడ్గా విడుదలైంది. ఈ సందర్భంగా ప్రీమియర్ షో అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంల... | 2 |
ఇప్పటికీ స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంటున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్కు విజయాలు మాత్రం రావడం లేదు. అయితే కొందరు హీరోలతో సినిమాలు చేయాలని ఆయన ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడట. సినిమాను జెట్ స్పీడుతో పూర్తి చేయడంతో దర్శకుడు పూరి జగన్నాథ్ తరువాతే ఎవరైనా. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా తాను ... | 2 |
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి: ది కంక్లూజన్` సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు కూడా `బాహుబలి-2` ముందు నిలవలేకపోయాయి. ఆ సినిమా ట్రైలర్ కూడా యూట్యూబ్లో రికార్డులు నమోదు చేసింది. అత్యంత మంది లైక్ చేసిన ట్రైలర్గా నిలిచింది. దాదాపు ఆరున్నర ల... | 2 |
నరేంద్ర మోదీ నేతృత్వంలో కమలదళం చరిత్ర తిరగరాసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో విజయబావుటా ఎగురవేసింది. 320కిపైగా సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 1951-52లో జరిగిన తొలి ఎన్నికల తర్వాత ఓ పార్టీ ఇన్ని స్థానాలను గెలుచుకోవడం ఇదే ప్రథమం. అయితే అప్పుడు ఉత్తరప్రదేశ్ అవిభక్తంగా ఉండగా మొత్తం 430 అసెంబ్... | 3 |
గొప్పవాళ్ళు తలుచుకుంటే గొడవలకు కొదవేముంటుంది? గోడలు కూడా గొడవలకు కేంద్ర బిందువులవుతాయి. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ‘గోడ’ ఇప్పుడొక ప్రపంచ వార్త! గొడవలతో అధ్యక్ష ఎన్నికల బరిలో దునికిన ఆయన గోడలతో పాలనను ప్రారంభిచాడు. అమెరికా – మెక్సికో దేశాల సరిహద్దులో గోడను నిర్మించేందుకు ఉద్దేశించిన ఫైలుపై సం... | 1 |
ఆంధ్రజ్యోతి: సరిహద్దుల్లో టెన్షన్.. క్రికెట్ ఫీల్డ్లో రణరంగం.. కనీవినీ ఎరుగని ఉత్కంఠ. ఇండియా-పాక్ తలపడితే ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కంటే కూడా ఎక్కువ మంది చూస్తారు. వన్డే క్రికెట్కు క్రేజ్ పోయిందనుకుంటున్న టైమ్లో బ్లాక్ బస్టర్ క్లాష్. ఛాంపియన్స్ ట్రోఫీలో బ్లాక్ బస్టర్ ఫైట్ జరగబోతోంది. ఇండియా-పాకిస్థాన్ తలపడబోతున్నాయి. ఇ... | 4 |
యంగ్ హీరో సాయిధరమ్ తేజ్, తనతో 'విన్నర్' చిత్రంలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్కి చాలా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'లకుల్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ తెలిపిన సాయిధరమ్, ఈ విశెష్తో పాటు ఓ ఫొటోని కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఫొటో వైరల్ అవుతోంది. పుట్టిన రోజు అంటే ఎవరైనా కేక్ కట్ చేసే ఫొటోనో, లేదంటే... | 2 |
హిందీలో విజయవంతమైన ‘క్వీన్’ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రీమేక్ అవుతోంది. ప్రస్తుతం పారిస్లో చిత్రీకరణ జరుగుతోంది. నాలుగు భాషల్లోనూ ‘క్వీన్’ టైటిల్ పాత్ర పోషిస్తున్న తమన్నా, కాజల్, మంజిమా మోహన్, పారుల్ యాదవ్పారిస్లో ఇలా ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. | 2 |
వ్యాపార విస్తరణలో మోడర్న్ సేఫ్టీ గ్లాస్..రూ.10 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపుబహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు, ఖరీదైన నివాస గృహాలు, కార్యాలయ భవనాలు... అన్నీ అద్దాల మేడలే. నిర్మాణంలో, డిజైనింగ్లో తమ కౌశల్యాన్ని ఆవిష్కరించేందుకు ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్ డెకొరేటర్స్ అత్యంత ఇష్టంగా ఎంచుకునేది గ్లాస్. గ్రీన్ ... | 0 |
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో కేదార్ జాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి వన్డేలో 120 పరుగులు చేసి ఓడిపోతుందనుకున్న మ్యాచ్ను గెలిపించి రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. సెకండ్ వన్డేలో 22 పరుగులు చేయగా మూడో వన్డేలో అజేయంగా 90 పరుగులు చేసి దాదాపుగా మ్యాచ్ గెలిపించినంత పని చేశాడు. బ్యాటింగ్లోనే కాదు అటు బౌ... | 4 |
హరియాణా శకటం ‘బేటీ బచావో, బేటీ పఢావో’ థీమ్తో సాగడం విశేషం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖ శకటాన్ని జీఎస్టీ థీమ్తో తీర్చిదిద్దడం ఆకర్షించింది. ఈ శకటం వచ్చినప్పుడు కేంద్ర విద్యుత శాఖ మంత్రి పియూష్ గోయల్ లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టడం కనిపించింది. ఇక.. గోవా, గుజరాత, ఒడిసా, పశ్చిమబెంగాల్, జమ్ము... | 3 |
కొచ్చి : అందరినీ గౌరవించడమే నాగరికత. మహిళల పట్ల మరింత మర్యాదగా ప్రవర్తించాలి. అభివృద్ధి చెందుతున్నకొద్దీ నడవడిక మెరుగుపడాలి. చేతికి వస్తున్న కొత్త హంగులను సద్వినియోగం చేయడం తెలుసుకోవాలి. అంతేకానీ ఆధునిక సదుపాయలతో చాటుమాటున ఉంటూ ఎదుటివారిని, అందులోనూ మహిళలను కించపరచడాన్ని ఎవరూ సమర్థించరు. మళయాళ సినీ నటి కావ్య మాధవన్కు ... | 2 |
న్యూఢిల్లీ, మే 9: ఐఆర్సీటీసీలో టికెట్లు బుక్ చేస్తున్నారా? అయితే మీ కోసం ఐఆర్సీటీసీ ఒక సరికొత్త వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులతోపాటు.. పే-ఆన్-డెలివరీ(పీవోడీ) పేరుతో మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అంటే, టికెట్లు బుక్ చేసి, అ... | 3 |
యూనివర్సిటీల పరిరక్షణకై ప్రగతిశీల, ప్రజాస్వామిక విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) నేడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ లో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తోంది. ఓయూ వైస్ ఛాన్సలర్ రామచంద్రం, భోపాల్ ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్ బుర్ర రమేష్, ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొండా నాగేశ్వర్ , సమున్నత, పలువురు విద్యార్థి సంఘ... | 1 |
'ముసలం' పై వివరణ కోరాలని ఎక్స్ఛేంజీలకు ఆదేశంన్యూఢిల్లీ: ఇన్ఫోసిస్లో వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు సెబి సన్నాహాలు చేస్తోంది. ఇన్ఫోసిస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఒక కన్నేసి ఉంచింది. టాటాలు, యునైటెడ్ స్పిరిట్స్, రికో ఇండియా తర్వాత ఇటీవల రెగ్... | 0 |
దేశీయ స్మార్ట్ఫోన్ల మార్కెట్లోకి మరో మూడు కొత్త ఫోన్లు వచ్చాయి. అమెరికాకు చెందిన ఇన్ఫోకస్ ‘టర్బో5’, చైనాకు చెందిన లీఫోన్ ‘లీఫోన్ డబ్ల్యు2’, నుబియా ‘ఎన్2’ ఫోన్లను విడుదల చేశాయి. లీఫోన్ డబ్ల్యు2: ఈ ఫోన్ రెండు 4జి సిమ్లకు సపోర్ట్ చేస్తుంది. 1.3 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జిబి రామ్, 8జిబి ఇంటర్నల్ మ... | 0 |
ఆగ్రా: ఆగ్రాలోని ఓ పెట్రోల్ బంక్లో కాల్పుల కలకలం రేగింది. దావూజీ హాస్పిటల్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న వైద్యుడు సునీల్పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. కారులో పెట్రోల్ పోయిస్తుండగా ఈ ఘటన జరిగింది. ముగ్గురు దుండగులు ఒక్కసారిగా ఆయనపై కాల్పులు జరపడంతో సునీల్కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సునీల్ అనుచరులతో దుండగులు ... | 3 |
న్యూఢిల్లీ: భారత సైన్యానికి సెల్ఫ్ ప్రొపల్షన్ గల 100 హోవిట్జర్ శతఘ్నులు ఉమ్మడిగా తయారుచేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన రక్షణ సంస్థ హన్వా టెక్విన్తో ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ హోవిట్జర్ల విలువ 4,500 కోట్ల రూపాయలు. ఇందులో 10 హోవిట్జర్లను దక్షిణ కొరియా నుంచి నేరుగా దిగుమతి చేసుకుంటా... | 0 |
హాలివుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలొన్ ‘రాంబో’ సినిమాతో యూనిర్సల్ స్టార్గా ఎదిగారు. ఇప్పటికీ యాక్షన్ ప్రియుల హాట్ ఫేవరెట్గానే కొనసాగుతున్న ఈ మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ కుర్రహీరో టైగర్ ష్రాఫ్ రాంబో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. రాంబో సినిమాకు తొలుత హృతి... | 2 |
పవర్స్టార్ పవన్కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకు అనధికార రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ కథాంశంతో ఇంతకుముందే తెలుగులో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. అసలు విషయమేమిటంటే.. అజిత్ నటించిన ఆ ‘వీరమ్’ చిత్రాన్ని తెలుగులో ‘వీరుడొక్కడే’గా ఎప్పుడో ... | 2 |
న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారంనాడు ప్రమాణస్వీకారం చేయడంతో భారత దేశ రాజకీయ చరిత్రలో తొలిసారి నాలుగు అత్యున్నత పదవులూ బీజేపీ నేతలకే దక్కినట్టయింది. వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ , ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బీజేపీ నుంచి వచ్చిన వారే. ఆర్ఎస్ఎస్ నేప... | 3 |
ఎక్కడి పోతావు చిన్నవాడా.. సినిమాలో నిఖిల్ సరసన అలరించిన భామ గుర్తుందా? నందితా శ్వేత. ఈ కోలీవుడ్ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్లో బిజీ అవనుందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఓ పెద్ద ప్రాజెక్ట్ కోసం ఆడిషన్లో పాల్గొన్నదని తెలుస్తోంది. దీంతో కొందరు ఫిల్మ్ మేకర్స్ కూడా తమ సినిమాల కోసం అమ్మడిని సంప్రదించారట. తన మొదటి స... | 2 |
అఖిల్ అక్కినేనిపై ఓ వార్త నెట్ మాయాజాలంలో హల్చల్ చేస్తోంది. అఖిల్ నటించిన మొదటి చిత్రం భారీ పరాజయం చవిచూడటంతో.. రెండో సినిమా విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నారు అఖిల్. రెండో చిత్రాన్ని మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో స్వయంగా నాగార్జునే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ 'హలో!'. అయితే అఖిల్ ఈ సినిమా విషయంలో దర్... | 2 |
మన దేశంలో బ్యాంకింగ్, బీమా, ఎంఎఫ్ రంగాల్లో నియంత్రణలు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. ఆయా సంస్థలను నియంత్రించే ఆర్బిఐ, ఐఆర్డిఎ, సెబి సమన్వయంతో పని చేస్తూ ఆయా రంగాల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఇందుకు ఆ సంస్థల చేతిలో ఉన్న సమర్థవంతమైన నియంత్రణాధికారాలే కారణం. అయినా ప్రభుత్వం ఎఫ్ఆర్డిఐ చట్టం వంటి కఠిన నిర్ణయం తీసుకోవడం అవసర... | 0 |
అతిక్రమిస్తే 100 శాతం జరిమానా వివరాలు తెలపాలని కోరిన ఐటీ శాఖన్యూఢిల్లీ, జూన్ 2: నల్లధనాన్ని అరికట్టడం కోసం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కేంద్రం ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటోంది. రెండు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం నగదు లావాదేవీలను నిర్వహించరాదని శుక్రవారం ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. నిబంధనలను అ... | 3 |
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రావాల్సిన సుమారు రూ.9.8 కోట్లకు పైగా బకాయిలను ఇండస్ట్రియల్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఇప్పించింది. ఈ పరిశ్రమల ఉత్పత్తులను వినియోగించుకుని బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న సంస్థలపై ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ అహ్మద్ నదీం ఆధ్వర్య... | 0 |
కొలంబో: రవిశాస్త్రి.. యువరాజ్.. గిబ్స్ వీరంతా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వీరిని తలదన్నేలా 15 ఏళ్ల కుర్రాడు ఒకే ఓవర్లో ఏడు సిక్సర్ల (ఒక బంతి నోబ్)తో చెలరేగాడు. అండర్-15 మురళీ గుడ్నెస్ కప్ ఫైనల్లో నవీందు పహసర (89 బంతుల్లో 109) ఎఫ్ఓజీ అకాడమీ తరఫున ఈ ఫీట్ సాధించాడు. లంక మాజీ స్పిన్... | 4 |
భువనేశ్వర్: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒడిశా ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యార్థులందరికీ ప్రభుత్వం ఉచిత యూనిఫాం అందజేస్తుందని, అలాగే తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు ఇస్తామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారంనాడు ప్రకటించారు. గతంలో పేదరికపు రేఖకు దిగువన ఉన్న ... | 3 |
బాలీవుడ్ నటుడు టామ్ ఆల్టర్(67) కేన్సర్తో బాధపడుతూ ముంబైలో శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ‘షత్రంజ్ కే ఖిలాడీ’, ‘జునూన్’, ‘క్రాంతి’ చిత్రాల్లో నటన ద్వారా ఆయన ప్రేక్షకులను కట్టిపడేశారు. టామ్ ఆల్టర్ రంగస్థల, టీవీ నటుడు, రచయిత, దర్శకుడు కూడా. శనివారం అంత్యక్రియలు ముగిసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. టామ్ ఆల్టర్ను ప... | 2 |
బెంగళూరు: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్కలాం బెంగళూరులో నివసించిన కేంద్రీయ విహార్ అపార్ట్మెంట్ నీటమునిగింది. ఇటీవల కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండడంతో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉండే యలహంక చెరువు మరవపోతోంది. రాజకాలువ సక్రమంగా లేకపోవడంతో మరవనుంచి వచ్చే వరద కేం ద్రీయవిహార్ అపార్ట్మెంట్లోకి చేరుతోంది. సె... | 3 |
మళ్లీ కొత్త గరిష్ఠ స్థాయిలో సూచీలు.. 4 రోజుల్లోనే 764 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లో అలుపెరుగని పరుగు కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజైన గురువారం నాడు కూడా మార్కెట్ బుల్స్ నియంత్రణలోనే ఉంది. తీవ్రమైన ఆటుపోట్ల మధ్య కూడా కీలక సూచీలు కొత్త ఆల్టైమ్ రికార్డు స్థాయిని చేరాయి. గురువారం అక్టోబ... | 0 |
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ సొంత పార్టీ వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు. ఓ పత్రికతో మాట్లాడుతూ 2019 లోక్సభ ఎన్నికల వ్యూహాన్ని పునఃసమీక్షించాలన్నారు. రాహుల్ గాంధీ తక్షణమే పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని, పూర్తి స్థాయిలో బాధ్యతలను స్వీకరించాలని చెప్పారు. ఆయన అధ్యక్షుడైతే... | 3 |
టౌన్షిప్లను సకల సౌకర్యాలతో డెవలప్ చేస్తున్నారు. ఏ చిన్న పని కోసం బయటకెళ్లాల్సిన పని లేదు. ఇంటి కొనుగోలుదారు, నిర్మాణ సమయంలోనే అభిరుచుల ప్రకారం ఆర్డరిస్తే పూర్తిస్థాయిలో ఉడ్వర్క్ పూర్తిచేయడంతో పాటు ఫర్నిచర్, ఏసీలు, ఫ్రిజ్, మోడ్యులర్ కిచెన్, సోలార్ తో సహా సమస్త సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. టౌన్షి్పల... | 0 |
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని కల్లోలిత బలోచిస్తాన్ ప్రావిన్స్లో భారీ సంఖ్యలో మిలిటెంట్లు లొంగిపోయారు. నిషేధానికి గురైన వివిధ సంస్థల నుంచి 430 మందికి పైగా.... తమ ఆయుధాలను అధికారులకు అప్పగించి లొంగిపోయారు. బలోచ్ రిపబ్లికన్ ఆర్మీ (బీఆర్ఏ), బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) సహా ఇతర వేర్పాటువాద గ్రూపులు భద్రతా సంస్థలపై, సైనిక ద... | 3 |
విలేజ్ బ్యాక్ గ్రౌండ్తో తెరకెక్కుతున్న మూవీ రంగస్థలం 1985. రామచరణ్ కెరీర్లోని ఇలాంటి సినిమా చేయడం తొలిసారి. అలాగే ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో అలరించనున్నారు. వినికిడి లోపం ఉన్న యువకుడిగా చెర్రీ నటించనున్నారు. సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుండటంతో.. దీని షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. సుకుమార... | 2 |
శంకరాభరణం సినిమాలో హీరో వయసు చాలా పెద్దది. అయినా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. కథలన్నీ జీవితాల్లో నుంచే వస్తాయి. అలాంటి అపూర్వ కథలతో ఉన్నతాభిరుచికి అంకురార్పణ చేసిన అద్వితీయ దర్శకుడు కె.విశ్వనాథ్. ఆయన కృషికి నిదర్శనంగా ఆయన తీసిన ప్రతి చిత్రం నిలుస్తుంది. సాగరసంగమం, స్వర్ణకమలం, స్వాతిముత్యం, సప్తపది, స్వరాభిషేకం ఇలా ఎన్నో... | 2 |
అక్కడ భారీగా తగ్గిన భారత విద్యార్థులు లండన్: బ్రిటన్ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో.. అక్కడకు వెళ్లి చదువుకునే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2011 నుంచి ఇప్పటి వరకు 44 శాతం మేర విద్యార్థులు బ్రిటన్కు వెళ్లడం మానేశారు. గురువారం బ్రిటన్ ఉన్నత విద్యా గణాంకాల సంస్థ ఈ వివరాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. గ... | 3 |
న్యూఢిల్లీ: ఆల్వార్లో గో సంరక్షకుల పేరిట కొందరు వ్యక్తులు ఓ ముస్లిం వ్యక్తిని కొట్టిచంపిన ఘటనపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపించాలనీ... కేంద్రహోంమంత్రి పార్లమెంటులో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభను వాయిదావేయాలంటూ పట్టుపట్టడంతో... రాజ్యసభ డిప్యూటీ ... | 3 |
పవర్ స్టార్ పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ అంటేనే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. పవన్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అంతే ఇక ఆ సినిమా గురించిన ఊసే లేదు. దసరాక... | 2 |
ఆర్థిక వ్యవస్థ పతనమౌతోంది!.. జీఎస్టీ వల్ల కూడా వృద్ధి తగ్గిందిమాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యమొహాలీ, సెప్టెంబరు 22: పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమౌతోందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. సాంకేతికంగా చూసినా, ఆర్థికంగా చూసినా నిజానికది పనిలేని పని అని వ్యాఖ్యానించారు. ప్రముఖ ఆర్థిక నిపుణుడు... | 3 |
బిజినెస్మ్యాన్ ముఖేష్ అంబానీ ఏర్పాటు చేసిన ఒక పార్టీకి బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ఐశ్వర్యారాయ్తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ పార్టీలో ఐశ్వర్యరాయ్ ఎల్లో కలర్ డ్రెస్లో మెరిసిపోయింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ డ్రెస్ ఖరీదు రూ. 3.7 లక్షలు. భర్త అభిషేక్ బచ్చన్తో పాటు ఐశ్వర్య ఈ పార్టీకి హాజరయ్యారు. స్టయిలిష... | 2 |
పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం రెండు అద్భుతమైన కానుకలను సిద్ధం చేస్తున్నారట యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగో ఆకట్టుకోవడంతో రాబోయే ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు అభిమానులు. మే 20న తన ప... | 2 |
నటసింహ బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విలన్గా బాలీవుడ్ హీరో నటించబోతున్నాడట. బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. కె.ఎస్.రవికుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ ... | 2 |
సిర్సా: గతంలో టాలీవుడ్ అగ్రహీరోలతో విజయవంతమైన సినిమాల్లో నటించిన హీరోయిన్ శిల్పాశెట్టి.. డేరా బాబా సహచరి హనీప్రీత్కు అత్యంత సన్నిహితురాలు. డేరా బాబా బంధువు భూపేంద్ర గోరా తాజాగా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. భూపేంద్ర చెప్పిన వివరాల ప్రకారం శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి పలుమార్లు హనీ ప్రీత్ను కలుసుకునేందుక... | 2 |
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తలను తీసుకొచ్చినవారికి బహుమతి ప్రకటించడంపై రాజ్యసభ సభ్యురాలు జయ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆమె మాట్లాడుతూ మహిళలపై నేరాలు జరుగుతూండగా, కేంద్ర ప్రభుత్వం ఆవులను రక్షించేందుకు నిబద్ధత చూపుతోందని ఆరోపించారు. మహిళా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇటువంటి ప్రక... | 3 |
వాషింగ్టన్, మే 15: కేన్సర్ కణాల పీకమణిచేందుకు సులభంగా ఆచరించగలిగే వినూత్న విధానాన్ని రోచెస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందులో కాంతిని ఉపయోగించి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తారు. కేన్సర్ కణాల ఉనికిని తెలుసుకోవడానికి ఈ కాంతి ఉపయోగపడుతుంది. దీంతో కేన్సర్ కణాలను ఈ రోగనిరోధక కణాలు నిర్వీర్యం చేస్తాయన... | 3 |
ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణే కాదు, ఆంధ్రప్రదేశ్ రైతుల ఇళ్ళల్లో లక్ష్మీదేవి నడయాడాలి అనేదే మా లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో మాతో కూడా కలిసి వస్తే రైతులకి మేలు చేసిన వాళ్ళవుతారు. కేవలం రాజకీయ కారణాలతో వ్యవహరిస్తే రైతులకు ఇంకాస్త అన్యాయం చేసిన వాళ్ళవుతారు. ఈవ్యాసం చదివే సమయానికి రైతుల కోసం అంటూ మీరు చేపట్టిన దీక్ష రెండో రోజుకి చేరుక... | 1 |
పెట్టుబడులకు ఢోకా లేకుండా దీర్ఘకాలంలో మంచి రాబడులు ఆశిస్తున్నారా? అయితే వాల్యూ ఫండ్స్పై దృష్టి పెట్టండి. ఇంతకీ వాల్యూ ఫండ్ అంటే ఏమిటి? వాటిలో పెట్టుబడులు ఎలా పెట్టాలో పిపిఎ్ఫఎఎస్ మ్యూచువల్ ఫండ్ చైర్మన్, సిఇఒ నీల్ పరాగ్ పారిఖ్ వివరిస్తున్నారు.వాల్యూ ఇన్వెస్టింగ్ఏదైనా ఒక వస్తువు లేదా ఆస్తి విలువ దాని యజమానికి ... | 0 |
హైదరాబాద్: సినీ తారలను డ్రగ్స్ కేసు వెంటాడుతోంది. డ్రగ్స్ కేసు టాలీవుడ్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఒకవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వీరికి బ్యాంక్ అధికారులు షాక్ ఇచ్చారు. సినీ నటులకు లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఆర... | 2 |
చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి వీకే శశికళ బుధవారంనాడు వీడియో కాన్ఫరెన్స్లో ప్రత్యక్షమయ్యారు. ఫిబ్రవరి 15 తర్వాత ఆమె కనిపించడం ఇదే ప్రథమం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో పరప్పన అగ్రహార జైలులో ప్రస్తుతం ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఫెరా ఉల్లంఘన కింద ఆమెపై నాలుగు కేసులు ఉండటంతో అభియోగాల న... | 3 |
టాలీవుడ్లో వెనకబడిన ఆ ఇద్దరు యంగ్ హీరోలూ.. తాజాగా ఒక రియాల్టీ షో తో వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరితో ఒక సినిమా చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇంతకీ ఎవరా ఇద్దరూ...? శివబాలాజీ.. నవదీప్… ఇద్దరూ టాలీవుడ్ లో తమ సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు కానీ.. అంతగా రాణించలేకపోయారు. క... | 2 |
పెళ్లి తరువాత సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్న ఆ అందాల భామ. ఈ విషయంలో ముందుగానే ఒక నిర్ణయం కూడా తీసుకుందట. స్టార్ హీరోయిన్గా కొనసాగుతుండగానే యంగ్ హీరో నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని ఇంటి కోడలిగా మారిపోయింది సమంత. అయితే పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని ఈ క్రేజీ హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. అక్కిన... | 2 |
ఇంటర్మీడియట్కు డిగ్రీ హోదా : ప్రభుత్వాన్ని కోరిన ఐసిఎఐన్యూఢిల్లీ: చార్టెర్డ్ అకౌంటెన్సీ (సిఎ) ఫైనల్ కోర్సును పోస్టు గ్రాడ్యుయేట్ (పిజి) డిగ్రీగా, సిఎ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ను డిగ్రీగా గుర్తించాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఇటీవల కార్పొరేట్ వ్... | 0 |
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆరు నెలలు, ఏడాది కాలపరిమితితో బిఎ్సఎన్ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త డేటా ఆఫర్లను తెచ్చింది. బిఎ్సఎన్ఎల్ ఆన్లైన్ రీచార్జ్ పోర్టల్, బిఎ్సఎన్ఎల్ యాప్ ద్వారా మాత్రమే వీటిని పొందవచ్చని సంస్థ తెలిపింది. 1,197 రూపాయల డేటా స్పెషల్ టారిఫ్ ఓచర్తో రీచార్జ్ చేసుకుంట... | 0 |
ఎన్టీఆర్తో సినారెకు ప్రత్యేక అనుబంధం చాలా మందికి తెలిసిందే. గీత రచయితగా ( ‘గులేబకావళి కథ’) అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ ఆయనతో స్నేహబంధాన్ని చివరి వరకు కొనసాగించారు. అప్పటి మదరాసు (నేటి చెన్నై) రైల్వే స్టేషన్కు స్వయంగా వెళ్లి ‘స్వాగతం’ పలకడంలోనే ఎన్టీఆర్ ఆయనకిచ్చిన విలువ అవగతమవుతుంది. దీనిని సినారె అపూర్వంగా చెప్పుకు... | 2 |
‘హుద్హుద్ వచ్చి వెళ్లిన తర్వాత వైజాగ్ను చూసి మనసు చలించిపోయింది. అందుకే ఏమీ ఆలోచించకుండా లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించాను. అయితే నిజానికి నా వద్ద అంత డబ్బు లేదు. నా స్నేహితుల వద్ద కూడా అంత ఎమౌంట్ లేదు. దాంతో రెండు వారాల టైమ్ తీసుకుని అప్పు చేసి ఆ డబ్బు సీఎంగారికి అందచేశా. అది పబ్లిసిటీ కోసం చేసింది కాదు. అలాగే ... | 2 |
న్యూఢిల్లీ : పాకిస్థాన్ నుంచి స్వదేశానికి వచ్చిన గీత తల్లిదండ్రులను గుర్తించడంలో సహాయపడాలని ప్రజలను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కోరారు. గీత చెముడు, మూగ బాధితురాలనే విషయం తెలిసిందే. ఆమె తల్లిదండ్రులను గుర్తించడంలో సహకరించినవారికి రూ.1 లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు. గీత బిహార్ లేదా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బాల... | 3 |
న్యూఢిల్లీ : పాకిస్థాన్ సైన్యం అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు, రెండు నాలుకల ధోరణి స్పష్టంగా వెల్లడైంది. ఆ దేశ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ‘‘మా కశ్మీరు సోదరుల స్వీయ నిర్ణయాధికారానికి మద్దతు కొనసాగిస్తామ’’ని పాక్ సైన్యం పేర్కొంది. పాక్ సైన్యం మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ శనివారం ఈ ప్రకటన చేసినట్లు ... | 3 |
ముంబై: పాత ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఎన్నారైలకు ఆర్బీఐ మరో అవకాశం కల్పించింది. వారు జూన్ 30 వ తేదీ వరకు పెద్ద నోట్లను మార్చుకోవచ్చని, శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ అవకాశం విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులకు మాత్రమేనని స్పష్టం చేసింది. నవంబర్ 9 వ తేదీని గడువుగా తీసుకుని, విదేశీ పర్యటనలో ఉ... | 3 |
కొన్ని యూట్యూబ్ చానళ్ల ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. ఏదో ఉన్నట్లు హెడ్డింగ్ పెట్టి వీడియో క్లిక్ చేయగానే ఇంకేదో చూపించి జనాలను మోసం చేసి సొమ్ము చేసుకునే ధోరణి వెర్రితలలు వేస్తున్న రోజులివి. ఇదిలా ఉంటే, సెలబ్రెటీలను కొన్ని యూట్యూబ్ చానళ్లు పనిగట్టుకుని మరీ దిగజారుస్తున్నాయి. వ్యూస్ యావలో హెడ్డింగ్స్ మరింత నీ... | 2 |
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెరికాలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్పై క్లాస్ యాక్షన్ లాసూట్ నమోదైంది. యుఎస్ ఫెడరల్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘిస్తూ తప్పుడు ప్రకటనలు ఇచ్చిందని ఆరోపిస్తూ ఒక ఇన్వెస్టర్ ఈ క్లాస్ యాక్షన్ లాసూట్ను దాఖలు చేశారు. తప్పుడు ప్రకటనల ద్వారా ఉద్దేశపూర్వకంగా షేరు ధర పడిపోయేలా కంపె... | 0 |
న్యూఢిల్లీ, నవంబరు 7: పెద్ద నోట్ల రద్దును వ్యవస్థీకృత దోపిడీగా అభివర్ణించిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్పై కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. ‘ఇది చరిత్రాత్మక నిర్ణయం. నల్లధనానికి వ్యతిరేకంగా మేం చేపట్టిన నైతిక చర్య. నైతికత విషయంలో బీజేపీకి కాంగ్రె్సకంటే ప్రత్యేక దృక్పథం ఉంది. మా ... | 3 |
చెన్నై: అనడానికి, చెప్పడానికి తేడా ఉంది. అనేటప్పుడు ఏదో ఒకటి అనొచ్చు కానీ చెప్పేటప్పుడు ఏదో ఒకటి చెప్పాలి. ఒకటి అన్నాక ఇంకోటి అనొచ్చు. కానీ, చెప్పాక ఇంకోటి చెప్పకూడదు. ఇంతవరకూ ఏదో ఒకటి అంటూ వచ్చిన తమిళ సూపర్స్టార్ ఇప్పుడు స్పష్టంగా 'రాజకీయాల్లోకి వస్తున్నా. కొత్త పార్టీ పెడుతున్నా. ఎన్నికల్లో పోటీ చేస్తా' అంటూ అభిమాను... | 3 |
ఉత్తరప్రదేశ్: నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మంత్రిగారి కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం డ్రైవ్ చేయడంతో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఉత్తరప్రదేశ్కు చెందిన మంత్రి ఓం ప్రకాశ్ సింగ్ కారు డ్రైవర్ ఈ ఘటనకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. హర్దోయి ప్రాంతంలో బండిలాగే వ్యక్తిని అతివేగంతో వచ్చిన మంత్రి క... | 3 |
నటి అర్చన ఇప్పుడో షార్ట్ ఫిల్మ్కు నిర్మాతగా మారారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రేమమాలిని దర్శకత్వంలో అర్చన ‘ఐ లైక్ ఇట్ దిస్ వే’ పేరుతో గంట నిడివిగల షార్ట్ ఫిల్మ్ నిర్మించారు. అర్చన, శివ కీలక పాత్రలు పోషించిన ఈ షార్ట్ ఫిల్మ్ ను ఇటీవల ప్రదర్శించారు. పలువురు సినీ ప్రముఖులు ప్రీమియర్ షోకు హాజరై యూనిట్ సభ్యులను అభినందించారు. | 2 |
తెలుగు చిత్రసీమలో బిజీయెస్ట్ లిరిక్ రైటర్ ఎవరంటే రామజోగయ్య శాస్త్రి పేరే వినిపిస్తుంది. ఆయన పాట జనం నోట చిందులు వేస్తూ సాగుతోంది. నేడు రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో రామజోగయ్య పాట టాపు రేపుతోంది. ఎంతలా అంటే టాలీవుడ్ టాప్ హీరోస్ అందరి చిత్రాల్లోనూ జోగయ్య పాట మారుమోగుతోంది. థియేటర్లలో ఆయన పా... | 2 |
చంబా: 'మేడ్ ఇన్ ఇండియా' ఫోనును చైనా ప్రజలు వాడే రోజు చూడాలని ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు చైనా యువకుడు 'మేడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్', 'మేడ్ ఇన్ ఇండియా' అని రాసున్న ఫోన్లతో సెల్ఫీ తీసుకునే రోజులు రావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంబాలో జరిగిన ర్యాలీలో రాహ... | 3 |
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్.. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఓ సినిమా పేరు. ఈ సినిమా పేరు చూస్తేనే రొమాంటిక్ ఎంటర్టైనర్ అని అనిపిస్తోంది కదూ. ఈ సినిమా టీజర్ బుధవారం విడుదలైంది. "అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులే.. పక్కోడి స్క్రీన్ప్లేలో".. అంటూ టీజర్ చివరలో ఓ డైలాగ్ వినిపిస్తుంది. అది నిజమేననిపిస్తుంది. దాదాపు ఈ సినిమా కొత్త, క... | 2 |
చెన్నై: రాజకీయ రంగప్రవేశం చేయడం సులభమని కానీ, నిలదొక్కుకుని రాణించడం కష్టమని సినీ నటుడు వివేక్ అభిప్రాయపడ్డారు. ఆయన సారథ్యంలోని పసుమై సైదై పథకం కింద సైదాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని గతంలో డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా బుధవారం 2 వేల మొక్కల ప... | 3 |
కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్షిప్బ్రిస్బేన్: కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత ఆటగాళ్లు తమ జోరు కొనసాగిస్తున్నారు. బుధవారం రెండో రోజు జరిగిన పోటీల్లో దేశానికి రెండు స్వర్ణాలతో పాటు రెండు రజతాలు, ఓ కాంస్యం దక్కింది. పురుషుల 10మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో అయితే క్లీన్స్వీప్ చేసింది. ఈ ఈవెంట్లో యువ షూటర్... | 4 |
బెంగళూరు : హెచ్-1బి వీసాలపై భారత స్వరం పెంచింది. ఈ వీసాలకు ప్రతిగా అమెరికాలో భారత కంపెనీలు అమెరికాలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాయని చెప్పారు. ఎస్టిపిఐ నిర్వహించిన ఒక సదస్సుకు హాజరైన కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. భారత ఐటి కంపెనీలు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నాయన్న ఆరోపణలను... | 0 |
టాలీవుడ్లో రెండు ప్రేమ కథా చిత్రాలను అందించిన దర్శకుడు విజయ్ కుమార్కు నిజ జీవితంలో సినిమా కష్టాలు ఎదురయ్యాయి. గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం సినిమాలకు దర్శకత్వం వహించిన విజయ్ కుమార్ కొండ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన హైదరాబాద్ రాంనగర్కు చెందిన ప్రసూన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ... | 2 |
న్యూఢిల్లీ: మరణ ధ్రువీకరణ పత్రానికీ ఇకముందు ఆధార్ తప్పనిసరి. వ్యక్తుల గుర్తింపులో మోసాలు జరక్కుండా నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకుంది. డెత్ రిజిస్ట్రేషన్కు ఆధార్ తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది. జమ్మూకశ్మీర్, అస... | 3 |
బాలకృష్ణతో పూరీ జగన్నాథ్ తీస్తోన్న తాజా చిత్రం దసరా కానుకగా రానుంది. అదే సమయంలో మహేశ్ -మురుగదాస్ కాంబోలో వస్తోన్న 'స్పైడర్' కూడా జనం ముందు నిలవనుందట. ఇదే జరిగితే, బాలయ్యతో మహేశ్ ఢీ కొనడం ఇది మూడోసారి అవుతుంది. ఇంతకు ముందు ఎలా సాగారో చూద్దాం. నందమూరి కుటుంబానికి, ఘట్టమనేని ఫ్యామిలీకి బాక్సాఫీస్ వార్ కొత్తకాదు. మహానటుడు ... | 2 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.