SNo int64 0 21.6k | date stringlengths 19 19 | heading stringlengths 3 91 ⌀ | body stringlengths 6 38.7k | topic stringclasses 5
values |
|---|---|---|---|---|
414 | 11-05-2017 00:39:13 | ఐడిబిఐపై ఆర్బిఐ నజర్ | భారీ ఎత్తున మొండిబకాయిలు పెరిగిపోవడంతో ఐడిబిఐ వ్యవహారాలపై భారత రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) ఒక కన్నేసింది. ఐడిబిఐ బ్యాంకును ఆర్బిఐ వాచ్లి్స్టలో చేర్చినట్టుగా తెలిసింది. నికర మొండిపద్దుల మొత్తం 6 శాతం దాటడం, వరసగా రెండేళ్ల పాటు నష్టాలను ప్రకటించడం, కాపిటల్ అడెక్వసీ నిర్దేశిత ప్రమాణాల కంటే తగ్గడం... ఈ సందర్భాల్లో బ్యాం... | business |
2,668 | 12-06-2017 00:40:32 | బ్యాంకింగ్ చీఫ్లతో నేడు జైట్లీ భేటీ | న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల(పిఎస్ బి) చీఫ్లతో సమావేశంకానున్నారు. దాదాపు రోజంతా జరిగే ఈ సమావేశంలో పిఎస్ బిలకు గుది బండగా మారిన మొండి బకాయి(ఎన్పిఎ)ల వసూళ్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. ఇంకా పిఎస్ బిల పనితీరు, ఒత్తిడిలో ఉన్న రుణాల పరిస్థితి, బ్యాలెన్స్ షీట్ల ... | business |
19,923 | 19-01-2017 19:51:31 | కీలక వికెట్ తీసిన జడేజా.. | కటక్: ఇంగ్లండ్తో జరుగుతున్న సెకండ్ వన్డే మ్యాచ్లో భారత జట్టు మూడో వికెట్ పడగొట్టింది. 82 పరుగులతో దూసుకెళుతున్న ఓపెనింగ్ బ్యాట్స్మన్ జాసన్ రాయ్ను జడేజా ఔట్ చేశాడు. 27వ ఓవర్ మొదటి బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ స్కోర్ 27 ఓవర్లు ముగిసే సమయానికి 172/3. మ్యాచ్ గెలిచేందుకు ఇంగ్లండ్ ఇంకా 209 పరుగులు చేయాల్సి... | sports |
15,762 | 23-11-2017 17:29:04 | మరో రెచ్చగొట్టే చర్యకు దిగిన పాకిస్థాన్ |
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాది హపీజ్ సయీద్ స్వేచ్ఛనిచ్చి, భారతదేశానికి ఆగ్రహం తెప్పించింది. 24 గంటలు గడవక ముందే మరో రెచ్చగొట్టే చర్యకు దిగింది. కశ్మీరు అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. కశ్మీరులో నిత్యం మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించింది. తమ నిఘా వర్గాల కన... | nation |
8,624 | 03-04-2017 15:48:23 | గోవాలో కొడుకుతో కలిసి అల్లు అర్జున్ స్విమ్మింగ్! | స్టార్ హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబంతో గడిపే అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోవడం లేదు ఇప్పటి సినిమా హీరోలు. ఖాళీగా ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం స్టైలిష్స్టార్ అల్లు అర్జున్కు అలవాటు. వృతిపరమైన విషయాలనే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం కూడా బన్నీకి అలవాటు. | entertainment |
19,527 | 17-08-2017 02:04:06 | ఆఫీసు బేరర్లను తొలగించండి..! |
సుప్రీం కోర్టుకు సీవోఏ మధ్యంతర నివేదికన్యూఢిల్లీ: బీసీసీఐ పగ్గాలను పూర్తిగా తమ చేతికే అందించాలని కమిటీ ఆఫ్ అడ్మిస్ట్రేటర్స్ (సీవోఏ) సుప్రీం కోర్టును కోరింది. సంస్కరణల అమలుపై కోర్టుకు సమర్పించిన ఐదో మధ్యంతర నివేదికలో ఆఫీసు బేరర్ల ఉదాసీన వైఖరిని ఎండగట్టింది. లోధా కమిటీ సిఫారసుల అమల్లో విఫలమైన బోర్డు తాత్కాలిక అధ్యక్షు... | sports |
16,516 | 25-02-2017 18:20:59 | ‘అమెరికాలో భారతీయులు మాతృభాషలో మాట్లాడొద్దు’ |
కన్సాస్ : విద్వేషపూరిత దాడుల నేపథ్యంలో ప్రవాస భారతీయుల్లో ఆందోళన తారస్థాయికి చేరింది. మనసారా మాతృభాషలో మాట్లాడుకోవాలన్నా భయపడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కలుసుకున్నపుడు ఆంగ్లంలోనే మాట్లాడుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పుకుంటున్నారు. ‘‘అమెరికాలో బహిరంగ ప్రదేశాల్లో కలుసుకున్నపుడు హిందీలోగానీ, ఏదైనా ఇతర భారతీయ భాష... | nation |
20,186 | 17-06-2017 02:38:00 | సూపర్ సండే ! | అటు క్రికెట్.. ఇటు హాకీ రెండింటిలో దాయాదుల సమరంన్యూఢిల్లీ : ఈ ఆదివారం ఇతర ఏ కార్యక్రమాలూ పెట్టుకోకండి..! ఆటలపై అమితాసక్తి ఉ న్న వారైతే మరీను..! ఒకవేళ తప్పకుండా పాల్గొనాల్సిన కార్యక్రమం అయితే కనీసం మధ్యా హ్నం ఒంటి గంటకల్లా పూర్తి చేసుకొనేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు రెండు అతి ము ఖ్యమైన మ్యాచ్లు ఉండడమే. ఆ రెం... | sports |
5,149 | 17-03-2017 14:34:15 | ఏటీఎం వర్కింగ్ రివ్యూ | నిర్మాణ సంస్థ: డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్, శ్రావ్య ఫిలిమ్స్తారాగణం: పవన్, కారుణ్య, రాకేష్, మహేంద్ర, నారాయణ, ఆషా, మహేశ్, అంబటి శీను, కిశోర్ దాస్, తిరుపతి దొరై, వీరబాబు, చిల్లర రాంబాబు, ఆంజనేయులు తదితరులుకూర్పు: శామ్యూల్ కళ్యాణ్సంగీతం: ప్రవీణ్ ఇమ్మడిఛాయాగ్రహణం: శివరామ్ నిర్మాతలు: కిశోరి బసి... | entertainment |
12,151 | 02-10-2017 01:28:39 | గీత తల్లిదండ్రుల ఆచూకీ చెబితే లక్ష: సుష్మా | న్యూఢిల్లీ: బధిర యువతి గీతను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన వారికి రూ.లక్ష నగదు అందజేస్తామని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు. భారత్కు చెందిన గీతను పదిహేనేళ్ల క్రితం లాహోర్లో ఆగి ఉన్న సంఝౌతా ఎక్స్ప్రె్సలో పాకిస్తాన్ సైనికులు గుర్తించారు. ప్రభుత్వం చొరవతో 2015లో భారత్లో అడుగుపెట్టిన గీత ఇప్పటికీ తల్లిదండ్రు... | nation |
20,275 | 20-01-2017 18:08:43 | యువీ గురించి సెహ్వాగ్ ఉద్వేగభరిత ట్వీట్ | న్యూఢిల్లీ : కటక్ వన్డేలో శతకంన్నర కొట్టిన యువరాజ్ సింగ్ గురించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉద్వేగభరితమైన ట్వీట్ చేశాడు. ‘అతను క్యాన్సర్ను ఓడించాడు. ఇవాళ ఇంగ్లండ్ బౌలర్లను మాత్రమే ఓడించాడు. నిరాశ చెందకూడదని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల’ని వీరూ అన్నాడు. క్యాన్సర్తో యువీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటి ఫొటో కూడా ... | sports |
21,177 | 25-02-2017 01:40:49 | తెల్ల గడ్డం తళతళ.. |
తళతళ మెరిసే తెల్ల గడ్డంతో ఉన్న ఈ వ్యక్తి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కోల్కతా వేదికగా జార్ఖండ్-కర్ణాటక జట్ల మధ్య జరిగే మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా మహీ ఇలా పూర్తిగా నెరిసిన గడ్డంతో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. | sports |
20,847 | 27-01-2017 21:15:14 | అనుకున్నట్టే జరిగింది : కేదార్ జాదవ్ | న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో వన్డే సిరీస్ తన క్రికెట్ కెరీర్కు టర్నింగ్ పాయింట్ అని కేదార్ జాదవ్ అన్నాడు. ఈ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడంపై మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదటి వన్డే తర్వాతనే దీన్ని ఊహించానని చెప్పాడు. ఇలానే తన ప్రదర్శన కొనసాగిస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం తేలికేనని ఫస్ట్ వన్డే తర్వాత అనుకున్న... | sports |
7,900 | 02-05-2017 11:02:49 | బాహుబలి-2లో ఐదు తప్పులున్నాయి: దర్శకుడు విఘ్నేష్ | గత నెల 28న విడుదలైన బాహుబలి-2 సినిమా సంచలనం సృష్టించే దిశగా దూసుకుపోతోంది. అక్కడక్కడ కొన్ని విమర్శలు ఎదురవుతున్నా మెజారిటీ జనాలు మాత్రం బాహుబలి-2ను ఆదరిస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా బాహుబలి-2ను, దర్శకుడు రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ బాహుబలి-2లోని... | entertainment |
17,425 | 03-07-2017 18:30:05 | ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం | న్యూఢిల్లీ: ఇజ్రయెల్ పర్యటనకు వెళ్తున్న తొలి భారత ప్రధానిగా ఇప్పటికే ప్రత్యేక ఘనత అందుకున్న నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఇజ్రయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ప్రధాని మోదీని రిసీవ్ చేసుకోనున్నారు. మంగళవారం మధ్యాహ్నం బెన్ గురియన్ విమానాశ్రయంలో ఆయన మోదీకి ఎదురేగి స్వాగతం పలకనున్నారు. ఇప్పటివరకు క... | nation |
20,211 | 19-12-2017 01:11:51 | నాయర్ అజేయ శతకం | పటిష్ఠ స్థితిలో కర్ణాటక కోల్కతా: కరుణ్ నాయర్ (148 బ్యాటింగ్) అజేయ శతకంతో రాణించడంతో.. విదర్భతో రంజీ సెమీస్లో కర్ణాటక పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఓవర్ నైట్ స్కోరు 36/3తో రెండో రోజైన సోమవారం ఆటను కొనసాగించిన కర్ణాటక.. వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 294/8 స్కోరు చేసింది. నాయర్తోపాటు కెప్టెన్ వినయ్ క... | sports |
9,688 | 09-01-2017 19:18:29 | చిరు, బాలయ్య సినిమాలపై స్పందించిన వెంకటేష్ | ఈసారి చిరు, బాలయ్య సినిమాలతో సంక్రాంతి అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎవరి నోట విన్నా ఈ రెండు సినిమాల గురించి ప్రస్తావనే. ఇప్పటికే ఈ సినిమాల విడుదలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అభిమానులు కూడా సినిమా విడుదలకు ముందు చేసే కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎంతో మంది అభిమానుల వలే తాను కూడా ఈ రెండు సినిమాల... | entertainment |
11,185 | 11-05-2017 01:56:46 | సబ్జెక్ట్ నిపుణులే తేలుస్తారు! | నీట్ ప్రశ్నపత్రంలో తప్పులపై సీబీఎస్ఈ.. పేపర్ లీక్ కేసులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి అరెస్టున్యూఢిల్లీ/షేక్పురా, మే 10: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లాయంటూ అభ్యర్థులు, విద్యానిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఈ అంశంపై బుధవా... | nation |
17,254 | 23-10-2017 16:04:14 | జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో షింజో అబే ప్రభంజనం | న్యూ ఢిల్లీ: జపాన్ అధికార పీఠాన్ని షింజో అబే మరోసారి కైవసం చేసుకున్నారు. జపాన్లో తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ, మరోపార్టీతో కూడిన సంకీర్ణ కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో లిబర్ డెమోక్రాటిక్ పార్టీ కూటమీ 312 సీట్లు గెలుచుకుంది. దీంతో జపాన్లో షింజో అబే నే... | nation |
6,092 | 25-11-2017 21:23:21 | 'భాగ్యనగరం' డ్రగ్స్పై సినిమా | కన్నడలో హిట్గా నిలిచిన 'రాజధాని' చిత్రాన్ని తెలుగులో సంతోష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సంతోష్ కుమార్ 'భాగ్యనగరం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్కి రెడీ అవుతోంది. కన్నడ బిగ్స్టార్ అయిన యష్ ఈ చిత్రంలో హీరోగా న... | entertainment |
1,218 | 07-06-2017 01:01:29 | ఎయిటెల్, టెలినార్ విలీనానికి ఆమోదం |
న్యూఢిల్లీ: టెలికాం రంగంలోని టెలినార్ ఇండియాను విలీనం చేసుకునేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తెలిపిందని ఎయిర్టెల్ ప్రకటించింది. ఈ రెండు కంపెనీలు విలీనం కోసం ఈ నెల ఫిబ్రవరిలో ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత, యుపి (ఈస్ట్), పశ్చిమబెంగాల్ (వెస్ట్), అస్సాం సర్కిళ్ళు టెలినార్ ... | business |
14,796 | 24-06-2017 09:35:25 | 100 మందిని మింగిన కొండచరియలు | బీజింగ్: చైనాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఫ్రావిన్స్లో భారీ స్థాయిలో కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో 100 మంది వరకూ మరణించారని తెలుస్తోంది. జన్మో గ్రామంలో ఓ పర్వతంలోని చాలా భాగం కూలిపోవడంతో సమీపంలోని 40 గృహాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీస... | nation |
15,343 | 16-08-2017 02:54:17 | గ్వామ్లో మోగిన ప్రమాద ఘంటికలు! | భయంతో పోలీసులకు ఫోన్లు చేసిన ద్వీపవాసులుఅవి పొరబాటు హెచ్చరికలేనని తర్వాత వెల్లడిఇప్పుడే దాడులు చేయబోనన్న కిమ్హగట్నా (గ్వామ్), ఆగస్టు 15: అది.. అసలే ఉత్తరకొరియా అణుక్షిపణులకు అందేంత దూరంలో ఉన్న గ్వామ్ ద్వీపం. అమెరికా నౌకా, వైమానిక దళ స్థావరాలున్న ఆ ద్వీపం మీద ‘ఇహనో ఇప్పుడో ఆ ద్వీపం మీద మేం బాంబులు వేసేస్తాం’ అంటూ ఉత్... | nation |
10,341 | 31-05-2017 14:22:54 | నేను ఎప్పుడూ అలా అనలేదు: నిత్యా మీనన్ | తెలుగులో అభినయ ప్రాధాన్యమున్న పాత్రలతో ఆకట్టుకున్నారు మలయాళ కుట్టి నిత్యామీనన్. ఉన్నట్టుండి ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దానికి కారణం ఆమె ఆలోచనలు దర్శకత్వంపైపు మలుపు తిరగడమే అనే వార్తలు వినిపించాయి. దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు నిత్యామీనన్. ‘నాకు దర్శకత్వం మీద ఇష్టమున్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. ... | entertainment |
7,796 | 26-01-2017 11:45:13 | సొంత రాష్ట్రాన్ని వదిలేసి.. పక్క రాష్ట్రంపై ప్రేమ ఎందుకో?: వర్మ | టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబుపై వివాదాల డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన డబ్బింగ్ మూవీలను ప్రమోట్ చేసుకోవడానికి తమిళ వికృత క్రీడ జల్లికట్టుకు మద్దతు తెలిపిన మహేశ్ బాబు.. తనను స్టార్గా నిలబెట్టిన ఏపీ కోసం, ఏపీ ప్రజల కోసం ఎందుకు మద్దతు తెలపట్లేదని ప్రశ్నించాడు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా.. పక్... | entertainment |
16,839 | 21-04-2017 00:31:12 | ఉమాభారతి రాజీనామా చేయాలి: ఖర్గే |
బెంగళూరు, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సుప్రీం ఆదేశాల నేపథ్యంలో కేంద్రమంత్రి ఉమాభారతి వెంటనే రాజీనామా చేయాలని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. గురువారం కలబురిగిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా కోరే బీజేపీ ఇప్పుడు ఎంద... | nation |
6,218 | 07-12-2017 19:09:22 | ఈ సినిమాకి వారు ముగ్గురు.. మూడు పిల్లర్స్: నిర్మాత డా.రవికిరణ్ | సప్తగిరి కథానాయకుడిగా నటించిన చిత్రం `సప్తగిరి ఎల్.ఎల్.బి`. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ బ్యానర్పై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 7న వరల్డ్వైడ్గా విడుదలైంది. ఈ సందర్భంగా ప్రీమియర్ షో అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంల... | entertainment |
8,625 | 12-09-2017 17:58:47 | చిరు, బాలయ్య, వెంకీ, మహేశ్, రవితేజతో సినిమాలకు ప్లాన్ | ఇప్పటికీ స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంటున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్కు విజయాలు మాత్రం రావడం లేదు. అయితే కొందరు హీరోలతో సినిమాలు చేయాలని ఆయన ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడట. సినిమాను జెట్ స్పీడుతో పూర్తి చేయడంతో దర్శకుడు పూరి జగన్నాథ్ తరువాతే ఎవరైనా. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా తాను ... | entertainment |
7,897 | 11-11-2017 15:24:05 | `బాహుబలి-2` రికార్డు బ్రేక్! | దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి: ది కంక్లూజన్` సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు కూడా `బాహుబలి-2` ముందు నిలవలేకపోయాయి. ఆ సినిమా ట్రైలర్ కూడా యూట్యూబ్లో రికార్డులు నమోదు చేసింది. అత్యంత మంది లైక్ చేసిన ట్రైలర్గా నిలిచింది. దాదాపు ఆరున్నర ల... | entertainment |
12,981 | 12-03-2017 01:51:51 | అతిపెద్ద విజయం! | నరేంద్ర మోదీ నేతృత్వంలో కమలదళం చరిత్ర తిరగరాసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో విజయబావుటా ఎగురవేసింది. 320కిపైగా సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 1951-52లో జరిగిన తొలి ఎన్నికల తర్వాత ఓ పార్టీ ఇన్ని స్థానాలను గెలుచుకోవడం ఇదే ప్రథమం. అయితే అప్పుడు ఉత్తరప్రదేశ్ అవిభక్తంగా ఉండగా మొత్తం 430 అసెంబ్... | nation |
4,305 | 03-02-2017 01:07:50 | గోడలూ – మేడలూ |
గొప్పవాళ్ళు తలుచుకుంటే గొడవలకు కొదవేముంటుంది? గోడలు కూడా గొడవలకు కేంద్ర బిందువులవుతాయి. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ‘గోడ’ ఇప్పుడొక ప్రపంచ వార్త! గొడవలతో అధ్యక్ష ఎన్నికల బరిలో దునికిన ఆయన గోడలతో పాలనను ప్రారంభిచాడు. అమెరికా – మెక్సికో దేశాల సరిహద్దులో గోడను నిర్మించేందుకు ఉద్దేశించిన ఫైలుపై సం... | editorial |
21,394 | 03-06-2017 15:52:46 | ఎమోషన్స్ను ఓ రేంజ్కు తీసుకెళుతున్న ఇండియా-పాక్ మ్యాచ్! | ఆంధ్రజ్యోతి: సరిహద్దుల్లో టెన్షన్.. క్రికెట్ ఫీల్డ్లో రణరంగం.. కనీవినీ ఎరుగని ఉత్కంఠ. ఇండియా-పాక్ తలపడితే ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కంటే కూడా ఎక్కువ మంది చూస్తారు. వన్డే క్రికెట్కు క్రేజ్ పోయిందనుకుంటున్న టైమ్లో బ్లాక్ బస్టర్ క్లాష్. ఛాంపియన్స్ ట్రోఫీలో బ్లాక్ బస్టర్ ఫైట్ జరగబోతోంది. ఇండియా-పాకిస్థాన్ తలపడబోతున్నాయి. ఇ... | sports |
9,787 | 10-10-2017 15:29:28 | రకుల్కి ఈ టైప్లో బర్త్డే విశెష్ ఎవరూ చెప్పి ఉండరేమో? | యంగ్ హీరో సాయిధరమ్ తేజ్, తనతో 'విన్నర్' చిత్రంలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్కి చాలా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'లకుల్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ తెలిపిన సాయిధరమ్, ఈ విశెష్తో పాటు ఓ ఫొటోని కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఫొటో వైరల్ అవుతోంది. పుట్టిన రోజు అంటే ఎవరైనా కేక్ కట్ చేసే ఫొటోనో, లేదంటే... | entertainment |
10,920 | 30-11-2017 22:43:00 | నలుగురు రాణులు |
హిందీలో విజయవంతమైన ‘క్వీన్’ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రీమేక్ అవుతోంది. ప్రస్తుతం పారిస్లో చిత్రీకరణ జరుగుతోంది. నాలుగు భాషల్లోనూ ‘క్వీన్’ టైటిల్ పాత్ర పోషిస్తున్న తమన్నా, కాజల్, మంజిమా మోహన్, పారుల్ యాదవ్పారిస్లో ఇలా ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. | entertainment |
2,694 | 08-10-2017 00:56:45 | గాజుపై పెరుగుతున్న మోజు | వ్యాపార విస్తరణలో మోడర్న్ సేఫ్టీ గ్లాస్..రూ.10 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపుబహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు, ఖరీదైన నివాస గృహాలు, కార్యాలయ భవనాలు... అన్నీ అద్దాల మేడలే. నిర్మాణంలో, డిజైనింగ్లో తమ కౌశల్యాన్ని ఆవిష్కరించేందుకు ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్ డెకొరేటర్స్ అత్యంత ఇష్టంగా ఎంచుకునేది గ్లాస్. గ్రీన్ ... | business |
20,666 | 23-01-2017 17:37:54 | 6వ స్థానంలో ఆణిముత్యాన్ని కనుగొన్నాం.. : గవాస్కర్ | న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో కేదార్ జాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి వన్డేలో 120 పరుగులు చేసి ఓడిపోతుందనుకున్న మ్యాచ్ను గెలిపించి రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. సెకండ్ వన్డేలో 22 పరుగులు చేయగా మూడో వన్డేలో అజేయంగా 90 పరుగులు చేసి దాదాపుగా మ్యాచ్ గెలిపించినంత పని చేశాడు. బ్యాటింగ్లోనే కాదు అటు బౌ... | sports |
16,899 | 27-01-2017 03:22:57 | ఆకాశ్ క్షిపణులు | హరియాణా శకటం ‘బేటీ బచావో, బేటీ పఢావో’ థీమ్తో సాగడం విశేషం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖ శకటాన్ని జీఎస్టీ థీమ్తో తీర్చిదిద్దడం ఆకర్షించింది. ఈ శకటం వచ్చినప్పుడు కేంద్ర విద్యుత శాఖ మంత్రి పియూష్ గోయల్ లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టడం కనిపించింది. ఇక.. గోవా, గుజరాత, ఒడిసా, పశ్చిమబెంగాల్, జమ్ము... | nation |
9,362 | 19-01-2017 18:16:18 | అసభ్య పోస్ట్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్! | కొచ్చి : అందరినీ గౌరవించడమే నాగరికత. మహిళల పట్ల మరింత మర్యాదగా ప్రవర్తించాలి. అభివృద్ధి చెందుతున్నకొద్దీ నడవడిక మెరుగుపడాలి. చేతికి వస్తున్న కొత్త హంగులను సద్వినియోగం చేయడం తెలుసుకోవాలి. అంతేకానీ ఆధునిక సదుపాయలతో చాటుమాటున ఉంటూ ఎదుటివారిని, అందులోనూ మహిళలను కించపరచడాన్ని ఎవరూ సమర్థించరు. మళయాళ సినీ నటి కావ్య మాధవన్కు ... | entertainment |
17,732 | 10-05-2017 04:05:55 | ఇంటికే రైలు టికెట్లు.. వచ్చాకే పైసలివ్వండి! | న్యూఢిల్లీ, మే 9: ఐఆర్సీటీసీలో టికెట్లు బుక్ చేస్తున్నారా? అయితే మీ కోసం ఐఆర్సీటీసీ ఒక సరికొత్త వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులతోపాటు.. పే-ఆన్-డెలివరీ(పీవోడీ) పేరుతో మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అంటే, టికెట్లు బుక్ చేసి, అ... | nation |
3,370 | 10-02-2017 03:04:42 | పీడీఎస్యూ రాష్ట్ర సదస్సు |
యూనివర్సిటీల పరిరక్షణకై ప్రగతిశీల, ప్రజాస్వామిక విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) నేడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ లో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తోంది. ఓయూ వైస్ ఛాన్సలర్ రామచంద్రం, భోపాల్ ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్ బుర్ర రమేష్, ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొండా నాగేశ్వర్ , సమున్నత, పలువురు విద్యార్థి సంఘ... | editorial |
527 | 13-02-2017 01:11:40 | ఇన్ఫీపై సెబి కన్ను | 'ముసలం' పై వివరణ కోరాలని ఎక్స్ఛేంజీలకు ఆదేశంన్యూఢిల్లీ: ఇన్ఫోసిస్లో వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు సెబి సన్నాహాలు చేస్తోంది. ఇన్ఫోసిస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఒక కన్నేసి ఉంచింది. టాటాలు, యునైటెడ్ స్పిరిట్స్, రికో ఇండియా తర్వాత ఇటీవల రెగ్... | business |
1,175 | 06-07-2017 00:52:33 | మార్కెట్లోకి మూడు కొత్త ఫోన్లు | దేశీయ స్మార్ట్ఫోన్ల మార్కెట్లోకి మరో మూడు కొత్త ఫోన్లు వచ్చాయి. అమెరికాకు చెందిన ఇన్ఫోకస్ ‘టర్బో5’, చైనాకు చెందిన లీఫోన్ ‘లీఫోన్ డబ్ల్యు2’, నుబియా ‘ఎన్2’ ఫోన్లను విడుదల చేశాయి. లీఫోన్ డబ్ల్యు2: ఈ ఫోన్ రెండు 4జి సిమ్లకు సపోర్ట్ చేస్తుంది. 1.3 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జిబి రామ్, 8జిబి ఇంటర్నల్ మ... | business |
16,809 | 03-04-2017 15:37:47 | దావూజీ హాస్పిటల్ డైరెక్టర్పై కాల్పులు | ఆగ్రా: ఆగ్రాలోని ఓ పెట్రోల్ బంక్లో కాల్పుల కలకలం రేగింది. దావూజీ హాస్పిటల్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న వైద్యుడు సునీల్పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. కారులో పెట్రోల్ పోయిస్తుండగా ఈ ఘటన జరిగింది. ముగ్గురు దుండగులు ఒక్కసారిగా ఆయనపై కాల్పులు జరపడంతో సునీల్కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సునీల్ అనుచరులతో దుండగులు ... | nation |
1,005 | 22-04-2017 00:13:07 | హోవిట్జర్ల తయారీలో ఎల్ అండ్ టి |
న్యూఢిల్లీ: భారత సైన్యానికి సెల్ఫ్ ప్రొపల్షన్ గల 100 హోవిట్జర్ శతఘ్నులు ఉమ్మడిగా తయారుచేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన రక్షణ సంస్థ హన్వా టెక్విన్తో ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ హోవిట్జర్ల విలువ 4,500 కోట్ల రూపాయలు. ఇందులో 10 హోవిట్జర్లను దక్షిణ కొరియా నుంచి నేరుగా దిగుమతి చేసుకుంటా... | business |
6,199 | 21-05-2017 20:46:57 | టైగర్.. తన మాట నిలబెట్టుకుంటాడా..? | హాలివుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలొన్ ‘రాంబో’ సినిమాతో యూనిర్సల్ స్టార్గా ఎదిగారు. ఇప్పటికీ యాక్షన్ ప్రియుల హాట్ ఫేవరెట్గానే కొనసాగుతున్న ఈ మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ కుర్రహీరో టైగర్ ష్రాఫ్ రాంబో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. రాంబో సినిమాకు తొలుత హృతి... | entertainment |
7,576 | 18-01-2017 11:38:16 | ‘కాటమరాయుడు’పై ఆ ప్రభావం పడుతుందా? | పవర్స్టార్ పవన్కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకు అనధికార రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ కథాంశంతో ఇంతకుముందే తెలుగులో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. అసలు విషయమేమిటంటే.. అజిత్ నటించిన ఆ ‘వీరమ్’ చిత్రాన్ని తెలుగులో ‘వీరుడొక్కడే’గా ఎప్పుడో ... | entertainment |
13,547 | 11-08-2017 17:08:07 | తొలిసారిగా నాలుగు కీలక రాజ్యాంగ పదవుల్లో బీజేపీ | న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారంనాడు ప్రమాణస్వీకారం చేయడంతో భారత దేశ రాజకీయ చరిత్రలో తొలిసారి నాలుగు అత్యున్నత పదవులూ బీజేపీ నేతలకే దక్కినట్టయింది. వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ , ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బీజేపీ నుంచి వచ్చిన వారే. ఆర్ఎస్ఎస్ నేప... | nation |
8,887 | 02-11-2017 15:27:14 | గ్లామర్ రోల్స్కైనా రెడీ: నందితా శ్వేత | ఎక్కడి పోతావు చిన్నవాడా.. సినిమాలో నిఖిల్ సరసన అలరించిన భామ గుర్తుందా? నందితా శ్వేత. ఈ కోలీవుడ్ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్లో బిజీ అవనుందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఓ పెద్ద ప్రాజెక్ట్ కోసం ఆడిషన్లో పాల్గొన్నదని తెలుస్తోంది. దీంతో కొందరు ఫిల్మ్ మేకర్స్ కూడా తమ సినిమాల కోసం అమ్మడిని సంప్రదించారట. తన మొదటి స... | entertainment |
7,380 | 03-11-2017 21:37:24 | అఖిల్పై ఈ వార్తలు నిజమేనా? | అఖిల్ అక్కినేనిపై ఓ వార్త నెట్ మాయాజాలంలో హల్చల్ చేస్తోంది. అఖిల్ నటించిన మొదటి చిత్రం భారీ పరాజయం చవిచూడటంతో.. రెండో సినిమా విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నారు అఖిల్. రెండో చిత్రాన్ని మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో స్వయంగా నాగార్జునే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ 'హలో!'. అయితే అఖిల్ ఈ సినిమా విషయంలో దర్... | entertainment |
1,596 | 12-12-2017 01:13:39 | ఎవరిది తప్పు.. ఎవరు బాధ్యులు | మన దేశంలో బ్యాంకింగ్, బీమా, ఎంఎఫ్ రంగాల్లో నియంత్రణలు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. ఆయా సంస్థలను నియంత్రించే ఆర్బిఐ, ఐఆర్డిఎ, సెబి సమన్వయంతో పని చేస్తూ ఆయా రంగాల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఇందుకు ఆ సంస్థల చేతిలో ఉన్న సమర్థవంతమైన నియంత్రణాధికారాలే కారణం. అయినా ప్రభుత్వం ఎఫ్ఆర్డిఐ చట్టం వంటి కఠిన నిర్ణయం తీసుకోవడం అవసర... | business |
15,847 | 03-06-2017 03:04:18 | 2 లక్షలు నగదు లావాదేవీలొద్దు |
అతిక్రమిస్తే 100 శాతం జరిమానా వివరాలు తెలపాలని కోరిన ఐటీ శాఖన్యూఢిల్లీ, జూన్ 2: నల్లధనాన్ని అరికట్టడం కోసం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కేంద్రం ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటోంది. రెండు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం నగదు లావాదేవీలను నిర్వహించరాదని శుక్రవారం ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. నిబంధనలను అ... | nation |
112 | 31-08-2017 02:19:44 | రూ. 9.8 కోట్ల బకాయిలు ఇప్పించిన ఇండస్ట్రియల్ కౌన్సిల్ | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రావాల్సిన సుమారు రూ.9.8 కోట్లకు పైగా బకాయిలను ఇండస్ట్రియల్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఇప్పించింది. ఈ పరిశ్రమల ఉత్పత్తులను వినియోగించుకుని బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న సంస్థలపై ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ అహ్మద్ నదీం ఆధ్వర్య... | business |
20,955 | 16-12-2017 03:08:01 | ఒకే ఓవర్లో 7 సిక్సర్లు | కొలంబో: రవిశాస్త్రి.. యువరాజ్.. గిబ్స్ వీరంతా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వీరిని తలదన్నేలా 15 ఏళ్ల కుర్రాడు ఒకే ఓవర్లో ఏడు సిక్సర్ల (ఒక బంతి నోబ్)తో చెలరేగాడు. అండర్-15 మురళీ గుడ్నెస్ కప్ ఫైనల్లో నవీందు పహసర (89 బంతుల్లో 109) ఎఫ్ఓజీ అకాడమీ తరఫున ఈ ఫీట్ సాధించాడు. లంక మాజీ స్పిన్... | sports |
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 3